Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:39 AM

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ
January 27, 2026 07:42 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

హుజూర్ నగర్: భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం సీనియర్ అసిస్టెంట్ రంగారావు, శానిటరి ఇన్స్పెక్టర్ మేరిగ్ అశోక్ గార్లకు ఈ రోజు అందజేశారు.కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు సరఫరా సక్రమం కాని పరిస్థితి, కొద్దిపాటి నీరు కూడా కలుషితంగా అందడం, రోడ్లలో చెత్తాచెదారులు, గుంతలు, వీధిలో దోమలు, కోతులు, కుక్కల స్పైరవిహారం తదితర సమస్యలతో పట్టణ ప్రజలు కష్టాలొలికిపోతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నా, మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించలేకపోవడం నిరాశాకారణమని తెలిపారు.ఇలాంటి పరిస్థితిని అధికారం ఉన్నా లేకున్నా, ప్రజల ఆవేదనను గౌరవిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొండ హరీష్ గౌడ్ మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింతలపూడి ఉమామహేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు, ఎన్నికల కన్వీనర్ ఆకుల భిక్షమయ్య, కో కన్వీనర్ చిత్తలూరి సోమయ్య, జిల్లా నాయకులు మేళ్లచెరువు లక్ష్మణ్, కంటు నాగరాజు, బలవంత్ సింగ్, పోతురాజు విజయ్, పులి నరసింహారావు, ములకలపల్లి ఉపేందర్, రఘువీర్ హరీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.కొండ హరీష్ గౌడ్ చివరగా, మున్సిపాలిటీ సమస్యలను పక్కననెట్టి నిర్లక్ష్యం చేయడం కొనసాగితే ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News