స్థానికం ప్రధాన ప్రతినిధి
హుజూర్ నగర్: భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం సీనియర్ అసిస్టెంట్ రంగారావు, శానిటరి ఇన్స్పెక్టర్ మేరిగ్ అశోక్ గార్లకు ఈ రోజు అందజేశారు.కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు సరఫరా సక్రమం కాని పరిస్థితి, కొద్దిపాటి నీరు కూడా కలుషితంగా అందడం, రోడ్లలో చెత్తాచెదారులు, గుంతలు, వీధిలో దోమలు, కోతులు, కుక్కల స్పైరవిహారం తదితర సమస్యలతో పట్టణ ప్రజలు కష్టాలొలికిపోతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నా, మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించలేకపోవడం నిరాశాకారణమని తెలిపారు.ఇలాంటి పరిస్థితిని అధికారం ఉన్నా లేకున్నా, ప్రజల ఆవేదనను గౌరవిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొండ హరీష్ గౌడ్ మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింతలపూడి ఉమామహేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు, ఎన్నికల కన్వీనర్ ఆకుల భిక్షమయ్య, కో కన్వీనర్ చిత్తలూరి సోమయ్య, జిల్లా నాయకులు మేళ్లచెరువు లక్ష్మణ్, కంటు నాగరాజు, బలవంత్ సింగ్, పోతురాజు విజయ్, పులి నరసింహారావు, ములకలపల్లి ఉపేందర్, రఘువీర్ హరీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.కొండ హరీష్ గౌడ్ చివరగా, మున్సిపాలిటీ సమస్యలను పక్కననెట్టి నిర్లక్ష్యం చేయడం కొనసాగితే ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి