PRINT TIME: April 10, 2026 01:20 PM
హయత్నగర్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
హయత్నగర్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 27, 2026 06:03 AM
46 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మైత్రి కుటీర్లో దేశభక్తి జోష్
హయత్నగర్, స్థానికం ప్రధాన ప్రతినిధి
హయత్నగర్ పరిధిలోని మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ అధ్యక్షులు ఎడ్ల నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం దేశభక్తి గీతాల మధ్య కార్యక్రమాలు కొనసాగాయి. రాజ్యాంగ విలువలు, దేశ సమగ్రత పట్ల ప్రతి పౌరుడూ బాధ్యతగా నిలవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాలనీలో ఐక్యత, సౌహార్ద వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి.ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, గౌరవ అధ్యక్షులు మేక మహేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బీరెల్లి వీర ప్రసాద్, కోశాధికారి రామ్మోహన్ రావుతో పాటు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి