Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:44 PM

హరితహారంపై హత్యే..! బీ.తుర్కపల్లిలో కానుగ–టేకు చెట్ల ఊచకోత

హరితహారంపై హత్యే..! బీ.తుర్కపల్లిలో కానుగ–టేకు చెట్ల ఊచకోత

హరితహారంపై హత్యే..! బీ.తుర్కపల్లిలో కానుగ–టేకు చెట్ల ఊచకోత
January 12, 2026 08:33 AM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హరితహారానికి హాని.. బీ.తుర్కపల్లిలో కానుగ, టేకు చెట్ల నరికివేత

ప్రాథమిక పాఠశాల వద్ద, ఆర్‌అండ్‌బీ రోడ్డుపై దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లా స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం బీ.తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన విలువైన కానుగ, టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా నరికివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బీ.తుర్కపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణతో పాటు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను లక్ష్యంగా చేసుకుని ఈ అకృత్యం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం సుమారు 20 వరకు చెట్లను పూర్తిగా నరికివేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నీడనిచ్చే ఉద్దేశంతో, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన హరితహారం కార్యక్రమానికే ఇది తూట్లు పొడిచిన చర్యగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాల పరిధిలో చెట్ల నరికివేత జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారులకు స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం అందించాల్సిన ప్రదేశంలో పచ్చదనం మాయమవడం తల్లిదండ్రులను కలచివేస్తోంది. అలాగే రహదారి భద్రత, ప్రయాణికులకు నీడ కోసం నాటిన ఆర్‌అండ్‌బీ రోడ్ చెట్లను కూడా నరికివేయడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి ఖదీర్ మాట్లాడుతూ, ఆదివారం రోజు సంఘటన జరగడంతో విషయం తమ దృష్టికి ఆలస్యంగా వచ్చిందన్నారు. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు పంపించి, నరికివేతకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే నరికివేసిన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటి హరితహారాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక హరితహారం కార్యక్రమాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News