Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:36 AM

హరితహారంపై హత్యే..! బీ.తుర్కపల్లిలో కానుగ–టేకు చెట్ల ఊచకోత

హరితహారంపై హత్యే..! బీ.తుర్కపల్లిలో కానుగ–టేకు చెట్ల ఊచకోత

హరితహారంపై హత్యే..! బీ.తుర్కపల్లిలో కానుగ–టేకు చెట్ల ఊచకోత
January 12, 2026 08:33 AM 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హరితహారానికి హాని.. బీ.తుర్కపల్లిలో కానుగ, టేకు చెట్ల నరికివేత

ప్రాథమిక పాఠశాల వద్ద, ఆర్‌అండ్‌బీ రోడ్డుపై దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లా స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం బీ.తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన విలువైన కానుగ, టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా నరికివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బీ.తుర్కపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణతో పాటు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను లక్ష్యంగా చేసుకుని ఈ అకృత్యం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం సుమారు 20 వరకు చెట్లను పూర్తిగా నరికివేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నీడనిచ్చే ఉద్దేశంతో, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన హరితహారం కార్యక్రమానికే ఇది తూట్లు పొడిచిన చర్యగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాల పరిధిలో చెట్ల నరికివేత జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారులకు స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం అందించాల్సిన ప్రదేశంలో పచ్చదనం మాయమవడం తల్లిదండ్రులను కలచివేస్తోంది. అలాగే రహదారి భద్రత, ప్రయాణికులకు నీడ కోసం నాటిన ఆర్‌అండ్‌బీ రోడ్ చెట్లను కూడా నరికివేయడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి ఖదీర్ మాట్లాడుతూ, ఆదివారం రోజు సంఘటన జరగడంతో విషయం తమ దృష్టికి ఆలస్యంగా వచ్చిందన్నారు. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు పంపించి, నరికివేతకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే నరికివేసిన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటి హరితహారాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక హరితహారం కార్యక్రమాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News