PRINT TIME: April 10, 2026 12:04 PM
హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి
హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి
January 16, 2026 09:29 PM
21 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింగ్వి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు (ప్రోటోకాల్) హార్కర వేణుగోపాల్ రావు, కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్, కార్పొరేషన్ చైర్మన్ అలేఖ్య పంజాలలు ఎంపీ సింగ్విని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.
రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో అభిషేక్ మను సింగ్వి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పర్యటనలో భాగంగా పార్టీ నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి