PRINT TIME: April 08, 2026 03:57 PM
హెల్మెట్ లేకుండా ప్రయాణం… జరిమానాలు తప్పవు! డీఎస్పీ నరసింగప్ప హెచ్చరిక
హెల్మెట్ లేకుండా ప్రయాణం… జరిమానాలు తప్పవు! డీఎస్పీ నరసింగప్ప హెచ్చరిక
April 08, 2026 12:56 PM
44 Views
స్థానికం ప్రతినిధి :
Somandepalli
Prakash
పెనుకొండ, ఏప్రిల్ 8: సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ట్రాఫిక్ నియమాల అమలుపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డీఎస్పీ నరసింగప్ప పర్యవేక్షణలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది జాతీయ రహదారి-44పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు 70 మంది ద్విచక్ర వాహనదారులను ఆపి పత్రాలు పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడం, చిన్నారులు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై పోలీసులు దృష్టి సారించారు.
వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని, ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి జరిమానాలు విధించారు.
ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని డీఎస్పీ నరసింగప్ప హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి