PRINT TIME: April 10, 2026 12:03 PM
గురుకుల ప్రవేశానికి విద్యార్థులకు స్టడీ మెటీరియల్
గురుకుల ప్రవేశానికి విద్యార్థులకు స్టడీ మెటీరియల్
January 21, 2026 04:52 PM
40 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మునుగోడు (రత్తిపల్లి),
మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఉచితంగా స్టడీ మెటీరియల్, పుస్తకాలను పంపిణీ చేశారు.పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ప్రోత్సహించడమే సంస్థ లక్ష్యమని మేడి హరికృష్ణ తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నంద్యాల నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి