Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:01 AM

గుండ్రంపల్లిలో వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులు ప్రారంభం

గుండ్రంపల్లిలో వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులు ప్రారంభం

గుండ్రంపల్లిలో వార్డు సభ్యులకు రెండవ విడత  శిక్షణ తరగతులు ప్రారంభం
February 23, 2026 05:13 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి అవసరం – కాటం వెంకటేశం

చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి రైతు వేదికలో రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 పంచాయతీ రాజ్ చట్టం గ్రామ పాలనలో కీలకమైన మార్గదర్శకమని తెలిపారు. గ్రామాల విధులు, నిధుల వినియోగం, స్థానిక అవసరాల ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు.కార్యక్రమానికి సభాధ్యక్షురాలిగా వ్యవహరించిన ఎంపీడీవో జయలక్ష్మి గ్రామ స్థాయి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం అవసరమని పేర్కొన్నారు. గ్రామ నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించి ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాల్సిన అవసరాన్ని వివరించారు.ఎంపీవో కోటయ్య, గుండ్రంపల్లి సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య తదితరులు పాల్గొని వార్డు సభ్యులకు వారి విధులు, నిధుల వినియోగ విధానం, గ్రామ స్థాయి పరిపాలనపై అవగాహన కల్పించారు.ఈ శిక్షణ తరగతుల ద్వారా ప్రజాప్రతినిధులు గ్రామ సమస్యలను సమర్థంగా పరిష్కరించేలా మార్గనిర్దేశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి శిక్షణలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News