Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:00 AM

గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరం

గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరం

గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరం
13-01-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరమని చౌటుప్పల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎస్.మల్లికార్జున్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కే.శ్రీకాంత్ లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు వెల్లంకి, సిరిపురం గ్రామాలలోనీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలుపుతూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు సందేశం ఇవ్వడంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ జారీ చేసిన ప్రతులను లబ్ధిదారులకు అందచేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని రామన్నపేట మండలం లో గృహ జ్యోతి పథకం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు10267, వ్యవసాయ రైతులు 8582 , వలిగొండ మండలంలో గృహాజ్యోతి పథకం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 11745, వ్యవసాయ లబ్ధిదారులు 11664 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు.వారి వెంట రామన్నపేట ఏఈ వి. కోటేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Sthanikam

గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరం

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరమని చౌటుప్పల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎస్.మల్లికార్జున్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కే.శ్రీకాంత్ లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు వెల్లంకి, సిరిపురం గ్రామాలలోనీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలుపుతూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు సందేశం ఇవ్వడంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ జారీ చేసిన ప్రతులను లబ్ధిదారులకు అందచేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని రామన్నపేట మండలం లో గృహ జ్యోతి పథకం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు10267, వ్యవసాయ రైతులు 8582 , వలిగొండ మండలంలో గృహాజ్యోతి పథకం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 11745, వ్యవసాయ లబ్ధిదారులు 11664 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు.వారి వెంట రామన్నపేట ఏఈ వి. కోటేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News