గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరం
గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరం
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరమని చౌటుప్పల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎస్.మల్లికార్జున్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కే.శ్రీకాంత్ లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు వెల్లంకి, సిరిపురం గ్రామాలలోనీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలుపుతూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు సందేశం ఇవ్వడంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ జారీ చేసిన ప్రతులను లబ్ధిదారులకు అందచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని రామన్నపేట మండలం లో గృహ జ్యోతి పథకం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు10267, వ్యవసాయ రైతులు 8582 , వలిగొండ మండలంలో గృహాజ్యోతి పథకం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 11745, వ్యవసాయ లబ్ధిదారులు 11664 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు.వారి వెంట రామన్నపేట ఏఈ వి. కోటేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి