గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం
గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం
Sthanikam District Staff Reporter
గడ్డం వెంకటేష్,ఎండి.సలీం
స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
గ్రామీణ స్థాయి క్రీడలకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేష్ ఎండి సలీం అన్నారు.ఆదివారం అర్బన్ కాలనీలో అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ మరియు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను వారు ప్రారంభించి మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడలకు ప్రత్యేక బడ్జెట్లు కేటాయించడంలో విఫలమయ్యాయని ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప గ్రామస్థాయి క్రీడలకు గుర్తింపు ఇవ్వడంలో ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించడంలో చిన్న చూపు చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో అనేకమంది యువత క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ మట్టిలో మాణిక్యాల గా ఉన్న పాలక ప్రభుత్వాలు మాత్రం వారిని ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని వారు అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ గ్రామీణ స్థాయి క్రీడల పట్ల తమ వైఖరిని చెప్పడంలో విఫలమయ్యాయని వారు అన్నారు.జిల్లావ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే సంక్రాంతి క్రీడోత్సవాలను ప్రజలు ఆదరించి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు,వీరితోపాటు రెడ్ క్రాస్ కమిటీ డైరెక్టర్ షేక్ అమిధ్ పాషా అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండి.సాజిద్,ఫయాజ్ సందీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి