Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం

గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం

గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం
January 11, 2026 05:06 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గడ్డం వెంకటేష్,ఎండి.సలీం

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

గ్రామీణ స్థాయి క్రీడలకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేష్ ఎండి సలీం అన్నారు.ఆదివారం అర్బన్ కాలనీలో అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ మరియు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను వారు ప్రారంభించి మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడలకు ప్రత్యేక బడ్జెట్లు కేటాయించడంలో విఫలమయ్యాయని ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప గ్రామస్థాయి క్రీడలకు గుర్తింపు ఇవ్వడంలో ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించడంలో చిన్న చూపు చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో అనేకమంది యువత క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ మట్టిలో మాణిక్యాల గా ఉన్న పాలక ప్రభుత్వాలు మాత్రం వారిని ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని వారు అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ గ్రామీణ స్థాయి క్రీడల పట్ల తమ వైఖరిని చెప్పడంలో విఫలమయ్యాయని వారు అన్నారు.జిల్లావ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే సంక్రాంతి క్రీడోత్సవాలను ప్రజలు ఆదరించి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు,వీరితోపాటు రెడ్ క్రాస్ కమిటీ డైరెక్టర్ షేక్ అమిధ్ పాషా అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండి.సాజిద్,ఫయాజ్ సందీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News