గ్రామపంచాయతీ విజేతలకు బీరప్ప గుడి ఆవరణలో ఘన సన్మానం
గ్రామపంచాయతీ విజేతలకు బీరప్ప గుడి ఆవరణలో ఘన సన్మానం
Editor Desk
సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ఘన సన్మానం
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట పట్టణ కేంద్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు శనివారం ఘన సన్మానం జరిగింది. రామన్నపేట కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి ఆవరణలో సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటే రమేష్తో పాటు వార్డు సభ్యులు మోటే మహేష్, బండ కవిత లింగస్వామి, గొరిగే పారిజాత శేఖర్లను శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని కోరారు.కార్యక్రమంలో సిందం లింగయ్య, మిర్యాల మల్లేష్, మోటే మల్లేష్, ఎర్ర అంజయ్య, కడగంచి ఐలయ్య, బర్ల డేవిడ్, గొరిగే కృష్ణ, మల్గా లింగయ్య, మోటే రాములు, శీలం యాదయ్య, గొరిగే సోములు, చిన్నం రమేష్, మోటే బీరప్ప, వల్లూరి ఐలయ్య, మోటే నరసింహ, గొరిగే నర్సింహ, మోటే గోపాల్, బంగారి మొగులయ్య, కొండే వెంకటేష్, మోటే బోలెష్, బెడిద లింగస్వామి, బెడిద మల్లేష్, మిర్యాల బిక్షం, బర్ల స్వామి, మోటే క్రాంతి, తోటకూరి కృష్ణ, చిన్నం వేణు, మోటి అనిల్, మోటే మదన్, మోటే చక్రపాణి, మిర్యాల లింగస్వామి, మోడీ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి