Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

గొట్టిపర్తి లో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం

గొట్టిపర్తి లో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం

 గొట్టిపర్తి లో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం
27-03-2026 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం నాడు శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక మండపంపై పట్టు వస్త్రాలతో అలంకరించి వేదమంత్రాలు నడుమ వేద బ్రాహ్మణులు త్యాగరాజు శర్మ ,సతీష్ శర్మ కళ్యాణ తంతు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలతో హొరెత్తించారు. కళ్యాణం అనంతరం భక్తులు పెద్ద ఎత్తున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తులు ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం నాడు శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక మండపంపై పట్టు వస్త్రాలతో అలంకరించి వేదమంత్రాలు నడుమ వేద బ్రాహ్మణులు త్యాగరాజు శర్మ ,సతీష్ శర్మ కళ్యాణ తంతు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలతో హొరెత్తించారు. కళ్యాణం అనంతరం భక్తులు పెద్ద ఎత్తున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తులు ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News