Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

గోరంట్లలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

గోరంట్లలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

గోరంట్లలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
22-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

గోరంట్ల,: బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోరంట్ల పట్టణంలో బాలికా శక్తి చైతన్య ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల సూచనల మేరకు కొలిమి చింతమాను వీధి, పూలేరు రోడ్‌లోని సంచార జాతుల నివాస ప్రాంతం, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా తోలుబొమ్మలాట, ఎల్ఈడి ప్రదర్శనల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల్య వివాహ నిషేధ చట్టం–2006, పిల్లలపై లైంగిక దాడుల నివారణకు సంబంధించిన చట్టాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గోరంట్ల ఎంపీడీఓ కమలాబాయి, ఎస్‌ఐ నిర్మల, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి, కౌన్సిలర్ శివలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, రెడ్‌క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ భక్త వత్సలం, ఉపాధ్యాయులు జగదీష్, పవన్, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

గోరంట్లలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

Article Image

గోరంట్ల,: బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోరంట్ల పట్టణంలో బాలికా శక్తి చైతన్య ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల సూచనల మేరకు కొలిమి చింతమాను వీధి, పూలేరు రోడ్‌లోని సంచార జాతుల నివాస ప్రాంతం, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా తోలుబొమ్మలాట, ఎల్ఈడి ప్రదర్శనల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల్య వివాహ నిషేధ చట్టం–2006, పిల్లలపై లైంగిక దాడుల నివారణకు సంబంధించిన చట్టాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గోరంట్ల ఎంపీడీఓ కమలాబాయి, ఎస్‌ఐ నిర్మల, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి, కౌన్సిలర్ శివలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, రెడ్‌క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ భక్త వత్సలం, ఉపాధ్యాయులు జగదీష్, పవన్, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News