గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో పోషణ పక్వాడ కార్యక్రమం
గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో పోషణ పక్వాడ కార్యక్రమం
Editor Desk
అంగన్వాడీల్లో THR, గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ ఉచితం: సీడీపీఓ రేఖల మమత
శిశువుకు ‘గోల్డెన్ 1000 డేస్’ ప్రాముఖ్యతపై అవగాహన: సూపర్వైజర్ వాణి
మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓ రేఖల మమత ఆదేశాల మేరకు ఈనెల 9 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా సోమవారం చిల్లపురం సెక్టర్ పరిధిలోని గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో అవగాహన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ శిశువు జీవితంలో అత్యంత కీలకమైన ‘గోల్డెన్ 1000 డేస్’ (గర్భధారణ నుంచి 2 సంవత్సరాల వరకు) ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు. ఈ కాలంలోనే బిడ్డ మెదడు వికాసం 80 శాతం పూర్తవుతుందని, సరైన పోషణ లేకపోతే భవిష్యత్తులో నేర్చుకునే సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపారు.
పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు బిడ్డ ఎత్తు, బరువు సరిగా పెరగకపోతే ‘స్టంటింగ్’ సమస్య వస్తుందని, ఒకసారి అది ఏర్పడితే తిరిగి సరిచేయడం కష్టమని హెచ్చరించారు. అలాగే ఈ దశలో సరైన పోషకాహారం అందితే భవిష్యత్తులో షుగర్, బీపీ, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు.
గర్భిణీ స్త్రీలు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, టీకాలు వేయించుకోవడం, పోషకాహారం తీసుకోవడం అవసరమని సూచించారు. పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 6 నెలల తర్వాత సప్లిమెంటరీ ఆహారం అందించాలని వివరించారు. పరిశుభ్రత పాటించడం కూడా అత్యంత కీలకమని చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ (THR), గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ రేఖల మమత సూచించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వాణి, అంగన్వాడీ టీచర్ బంధనకంటి ఝాన్సీ రాణి, హెల్పర్లు రమణమ్మ, వీబీకే ఏశోద, స్వాతి, గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి