Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:59 AM

గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో పోషణ పక్వాడ కార్యక్రమం

గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో పోషణ పక్వాడ కార్యక్రమం

గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో పోషణ పక్వాడ కార్యక్రమం
April 13, 2026 12:58 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంగన్వాడీల్లో THR, గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ ఉచితం: సీడీపీఓ రేఖల మమత

శిశువుకు ‘గోల్డెన్ 1000 డేస్’ ప్రాముఖ్యతపై అవగాహన: సూపర్వైజర్ వాణి

మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓ రేఖల మమత ఆదేశాల మేరకు ఈనెల 9 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా సోమవారం చిల్లపురం సెక్టర్ పరిధిలోని గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో అవగాహన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ శిశువు జీవితంలో అత్యంత కీలకమైన ‘గోల్డెన్ 1000 డేస్’ (గర్భధారణ నుంచి 2 సంవత్సరాల వరకు) ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు. ఈ కాలంలోనే బిడ్డ మెదడు వికాసం 80 శాతం పూర్తవుతుందని, సరైన పోషణ లేకపోతే భవిష్యత్తులో నేర్చుకునే సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపారు.

పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు బిడ్డ ఎత్తు, బరువు సరిగా పెరగకపోతే ‘స్టంటింగ్’ సమస్య వస్తుందని, ఒకసారి అది ఏర్పడితే తిరిగి సరిచేయడం కష్టమని హెచ్చరించారు. అలాగే ఈ దశలో సరైన పోషకాహారం అందితే భవిష్యత్తులో షుగర్, బీపీ, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు.

గర్భిణీ స్త్రీలు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, టీకాలు వేయించుకోవడం, పోషకాహారం తీసుకోవడం అవసరమని సూచించారు. పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 6 నెలల తర్వాత సప్లిమెంటరీ ఆహారం అందించాలని వివరించారు. పరిశుభ్రత పాటించడం కూడా అత్యంత కీలకమని చెప్పారు.

అంగన్వాడీ కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ (THR), గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ రేఖల మమత సూచించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వాణి, అంగన్వాడీ టీచర్ బంధనకంటి ఝాన్సీ రాణి, హెల్పర్లు రమణమ్మ, వీబీకే ఏశోద, స్వాతి, గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News