గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ ఉపేంద్ర రవీందర్ రెడ్డి దంపతులు
గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ ఉపేంద్ర రవీందర్ రెడ్డి దంపతులు
Editor Desk
సిరిపురంలో గోదాదేవి కల్యాణ మహోత్సవం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీరాముల వారి ఆలయంలో ధనుర్మాసం–భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గోదాదేవి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు.
స్వామివారికి గోషిక సంధ్య–సత్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించగా, వందలాది మంది భక్తులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో గోదాదేవి అమ్మవారిని కల్యాణ మండపానికి శోభాయాత్రగా తీసుకువచ్చారు. వివిధ రకాల ఫల–పుష్పాలతో కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు.కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముడుదుడ్ల అనూష రమేష్, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, గాదె శంకరయ్య, కూనూరు రమేష్, పున్న వెంకటేష్, పగుడాల లక్ష్మి, మోటె స్వామి, కంకల అర్చన, కట్ట భానుశ్రీ, గాదె యాదయ్య, గుంటోజు కృష్ణమాచారి, సంగిశెట్టి మహేష్ తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి