Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప
24-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు, మే 24: హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే ‘గొడ్డలి పార్టీ’ రాష్ట్రానికి హానికరమని మండిపడ్డారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుండటాన్ని తట్టుకోలేక జగన్ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీ పాలనలో జరిగిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు.

జగన్ వ్యాఖ్యలతో రాజారెడ్డి దమనకాండ, వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్ర మళ్లీ చర్చకు వచ్చిందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు, ఇతర రాజకీయ ఘటనలపై రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు.

తిరుమల, హిందూ దేవాలయాల అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ కుటుంబం హిందూ దేవుళ్లపై కక్షతో వ్యవహరించిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాలు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, హింసాత్మక ఘటనలు వైసీపీ పాలనలో పెరిగాయని విమర్శించారు.

ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇంధన ధరలు తగ్గించినా జగన్ ప్రభుత్వం తగ్గించలేదని విమర్శించారు.

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని, జగన్ చేసే ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తామని మాన్వి దేవేంద్రప్ప హెచ్చరించారు.

Sthanikam

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప

Article Image

కర్నూలు, మే 24: హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే ‘గొడ్డలి పార్టీ’ రాష్ట్రానికి హానికరమని మండిపడ్డారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుండటాన్ని తట్టుకోలేక జగన్ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీ పాలనలో జరిగిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు.

జగన్ వ్యాఖ్యలతో రాజారెడ్డి దమనకాండ, వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్ర మళ్లీ చర్చకు వచ్చిందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు, ఇతర రాజకీయ ఘటనలపై రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు.

తిరుమల, హిందూ దేవాలయాల అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ కుటుంబం హిందూ దేవుళ్లపై కక్షతో వ్యవహరించిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాలు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, హింసాత్మక ఘటనలు వైసీపీ పాలనలో పెరిగాయని విమర్శించారు.

ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇంధన ధరలు తగ్గించినా జగన్ ప్రభుత్వం తగ్గించలేదని విమర్శించారు.

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని, జగన్ చేసే ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తామని మాన్వి దేవేంద్రప్ప హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News