‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప
‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప
Editor Desk
కర్నూలు, మే 24: హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే ‘గొడ్డలి పార్టీ’ రాష్ట్రానికి హానికరమని మండిపడ్డారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుండటాన్ని తట్టుకోలేక జగన్ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీ పాలనలో జరిగిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు.
జగన్ వ్యాఖ్యలతో రాజారెడ్డి దమనకాండ, వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్ర మళ్లీ చర్చకు వచ్చిందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు, ఇతర రాజకీయ ఘటనలపై రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు.
తిరుమల, హిందూ దేవాలయాల అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ కుటుంబం హిందూ దేవుళ్లపై కక్షతో వ్యవహరించిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాలు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, హింసాత్మక ఘటనలు వైసీపీ పాలనలో పెరిగాయని విమర్శించారు.
ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇంధన ధరలు తగ్గించినా జగన్ ప్రభుత్వం తగ్గించలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని, జగన్ చేసే ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తామని మాన్వి దేవేంద్రప్ప హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి