Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప
May 24, 2026 08:11 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు, మే 24: హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే ‘గొడ్డలి పార్టీ’ రాష్ట్రానికి హానికరమని మండిపడ్డారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుండటాన్ని తట్టుకోలేక జగన్ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీ పాలనలో జరిగిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు.

జగన్ వ్యాఖ్యలతో రాజారెడ్డి దమనకాండ, వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్ర మళ్లీ చర్చకు వచ్చిందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు, ఇతర రాజకీయ ఘటనలపై రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు.

తిరుమల, హిందూ దేవాలయాల అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ కుటుంబం హిందూ దేవుళ్లపై కక్షతో వ్యవహరించిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాలు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, హింసాత్మక ఘటనలు వైసీపీ పాలనలో పెరిగాయని విమర్శించారు.

ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇంధన ధరలు తగ్గించినా జగన్ ప్రభుత్వం తగ్గించలేదని విమర్శించారు.

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని, జగన్ చేసే ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తామని మాన్వి దేవేంద్రప్ప హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News