Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:20 AM

గంగుల పూలమ్మ–శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు

గంగుల పూలమ్మ–శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు

గంగుల పూలమ్మ–శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు
January 24, 2026 05:40 AM 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో గంగుల పూలమ్మ–శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 25వ తేదీ మధ్యాహ్నం ఒకటి గంటలకు గ్రామపంచాయతీ పరిధిలో ఈ పోటీలు జరగనున్నాయి.ఈ ముగ్గుల పోటీలకు ప్రథమ బహుమతిగా ఐదు వేల పదహారు రూపాయలు, ద్వితీయ బహుమతిగా మూడు వేల పదహారు రూపాయలు, తృతీయ బహుమతిగా వెయ్యి ఐదు వందల పదహారు రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే వారు తమకు అవసరమైన రంగులను స్వయంగా తీసుకురావాల్సి ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.పోటీల్లో విజేతలైన వారికి గ్రామ ప్రాథమిక పాఠశాలలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ బహుమతులను గ్రామ మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, శ్రీలత దంపతులు అందజేయనున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News