గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ
గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ
స్థానికం బృందం
పాఠశాలలో వివరాలు సేకరించిన సామాజిక కార్యకర్తలు
స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నాలుగు రోజుల క్రితం 1098కు ఫోన్ చేసి చేసిన ఫిర్యాదులపై సామాజిక కార్యకర్తలు స్పందించారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్, నేషనల్ హ్యుమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఇంతియాజ్ గురువారం గందమల్ల గ్రామాన్ని సందర్శించి పాఠశాలలో వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశమై విద్యార్థులు చేసిన ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ అవసరమని వారు అభిప్రాయపడ్డారు.సేకరించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారులకు వ్రాతపూర్వకంగా అందజేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల సమస్యలను తేలికగా తీసుకోకుండా పారదర్శకంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి