Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:56 AM

గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ

గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ

గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ
22-01-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాఠశాలలో వివరాలు సేకరించిన సామాజిక కార్యకర్తలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నాలుగు రోజుల క్రితం 1098కు ఫోన్ చేసి చేసిన ఫిర్యాదులపై సామాజిక కార్యకర్తలు స్పందించారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్, నేషనల్ హ్యుమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఇంతియాజ్ గురువారం గందమల్ల గ్రామాన్ని సందర్శించి పాఠశాలలో వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశమై విద్యార్థులు చేసిన ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ అవసరమని వారు అభిప్రాయపడ్డారు.సేకరించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారులకు వ్రాతపూర్వకంగా అందజేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల సమస్యలను తేలికగా తీసుకోకుండా పారదర్శకంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.







Sthanikam

గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ

Article Image

పాఠశాలలో వివరాలు సేకరించిన సామాజిక కార్యకర్తలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నాలుగు రోజుల క్రితం 1098కు ఫోన్ చేసి చేసిన ఫిర్యాదులపై సామాజిక కార్యకర్తలు స్పందించారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్, నేషనల్ హ్యుమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఇంతియాజ్ గురువారం గందమల్ల గ్రామాన్ని సందర్శించి పాఠశాలలో వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశమై విద్యార్థులు చేసిన ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ అవసరమని వారు అభిప్రాయపడ్డారు.సేకరించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారులకు వ్రాతపూర్వకంగా అందజేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల సమస్యలను తేలికగా తీసుకోకుండా పారదర్శకంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.







మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News