Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:40 PM

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి
January 07, 2026 07:23 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి విజయం సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో పార్టీ జెండాను ఎగురవేయాలంటే శ్రేణులన్నింటినీ సమన్వయం చేస్తూ చురుకుగా ముందుకు నడిపించే సమర్థుడైన కొత్త డివిజన్ అధ్యక్షుడి నియామకం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ అంశంపై నాయకులతో విస్తృతంగా చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు, డివిజన్ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News