Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:04 AM

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి
January 07, 2026 07:23 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి విజయం సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో పార్టీ జెండాను ఎగురవేయాలంటే శ్రేణులన్నింటినీ సమన్వయం చేస్తూ చురుకుగా ముందుకు నడిపించే సమర్థుడైన కొత్త డివిజన్ అధ్యక్షుడి నియామకం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ అంశంపై నాయకులతో విస్తృతంగా చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు, డివిజన్ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News