Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:12 AM

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి

GHMC ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ – మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి
January 07, 2026 07:23 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి విజయం సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా ఎన్టీఆర్ నగర్ డివిజన్‌లో పార్టీ జెండాను ఎగురవేయాలంటే శ్రేణులన్నింటినీ సమన్వయం చేస్తూ చురుకుగా ముందుకు నడిపించే సమర్థుడైన కొత్త డివిజన్ అధ్యక్షుడి నియామకం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ అంశంపై నాయకులతో విస్తృతంగా చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు, డివిజన్ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News