Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం
January 12, 2026 07:49 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వివిధ రకాల పూలతో

సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం.

ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్ లోని దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో గత డిసెంబర్ 16 నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవములలో భాగంగా సోమవారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని వేదికపై ఉంచి సంపంగి, జాజి, చామంతి, మల్లేలు, కనకాంబరాలు, గన్నేరు, పొగడ, గులాబీలు, తామెరలు, కలువ, మొగలి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం వివిధ రకాల సుగంధభరితమైన పూలతో

సప్తవర్ణ శోభితంగా, అత్యంత వైభవంగా పుష్పాభిషేకం నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణ చార్యులు, అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు. రంగు రంగుల పుష్పాల మధ్య స్వామి అమ్మవార్ల వైభవం చూసి తరించిపోయామని, ఇలాంటి వైభవం ఈ ఆలయంలో తప్ప ఏ ఆలయంలో కూడా చూడలేదని భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణ చార్యులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే ఒక వైభవమైన ఉత్సవం శ్రీ పుష్పయాగం. దీనిని ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించడానికి, లోకకల్యాణాన్ని కాంక్షించి, వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవిలకు అష్టోత్తర శత పుష్పాలతో, వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించామని అన్నారు. అనంతరం స్వామివారి వివిధ రకాల అద్భుతాలంకరణలో ఒక భక్తుడు రూపొందించిన క్యాలెండర్ ను ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించి, దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచితంగా పంపిణీ చేశామని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News