ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం
ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం
Sthanikam District Staff Reporter krishna
ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వివిధ రకాల పూలతో
సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం.
ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్ లోని దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో గత డిసెంబర్ 16 నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవములలో భాగంగా సోమవారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని వేదికపై ఉంచి సంపంగి, జాజి, చామంతి, మల్లేలు, కనకాంబరాలు, గన్నేరు, పొగడ, గులాబీలు, తామెరలు, కలువ, మొగలి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం వివిధ రకాల సుగంధభరితమైన పూలతో
సప్తవర్ణ శోభితంగా, అత్యంత వైభవంగా పుష్పాభిషేకం నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణ చార్యులు, అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు. రంగు రంగుల పుష్పాల మధ్య స్వామి అమ్మవార్ల వైభవం చూసి తరించిపోయామని, ఇలాంటి వైభవం ఈ ఆలయంలో తప్ప ఏ ఆలయంలో కూడా చూడలేదని భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణ చార్యులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే ఒక వైభవమైన ఉత్సవం శ్రీ పుష్పయాగం. దీనిని ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించడానికి, లోకకల్యాణాన్ని కాంక్షించి, వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవిలకు అష్టోత్తర శత పుష్పాలతో, వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించామని అన్నారు. అనంతరం స్వామివారి వివిధ రకాల అద్భుతాలంకరణలో ఒక భక్తుడు రూపొందించిన క్యాలెండర్ ను ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించి, దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచితంగా పంపిణీ చేశామని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి