Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:48 PM

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం
12-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వివిధ రకాల పూలతో

సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం.

ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్ లోని దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో గత డిసెంబర్ 16 నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవములలో భాగంగా సోమవారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని వేదికపై ఉంచి సంపంగి, జాజి, చామంతి, మల్లేలు, కనకాంబరాలు, గన్నేరు, పొగడ, గులాబీలు, తామెరలు, కలువ, మొగలి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం వివిధ రకాల సుగంధభరితమైన పూలతో

సప్తవర్ణ శోభితంగా, అత్యంత వైభవంగా పుష్పాభిషేకం నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణ చార్యులు, అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు. రంగు రంగుల పుష్పాల మధ్య స్వామి అమ్మవార్ల వైభవం చూసి తరించిపోయామని, ఇలాంటి వైభవం ఈ ఆలయంలో తప్ప ఏ ఆలయంలో కూడా చూడలేదని భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణ చార్యులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే ఒక వైభవమైన ఉత్సవం శ్రీ పుష్పయాగం. దీనిని ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించడానికి, లోకకల్యాణాన్ని కాంక్షించి, వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవిలకు అష్టోత్తర శత పుష్పాలతో, వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించామని అన్నారు. అనంతరం స్వామివారి వివిధ రకాల అద్భుతాలంకరణలో ఒక భక్తుడు రూపొందించిన క్యాలెండర్ ను ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించి, దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచితంగా పంపిణీ చేశామని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం

Article Image

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వివిధ రకాల పూలతో

సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం.

ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్ లోని దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో గత డిసెంబర్ 16 నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవములలో భాగంగా సోమవారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని వేదికపై ఉంచి సంపంగి, జాజి, చామంతి, మల్లేలు, కనకాంబరాలు, గన్నేరు, పొగడ, గులాబీలు, తామెరలు, కలువ, మొగలి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం వివిధ రకాల సుగంధభరితమైన పూలతో

సప్తవర్ణ శోభితంగా, అత్యంత వైభవంగా పుష్పాభిషేకం నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణ చార్యులు, అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు. రంగు రంగుల పుష్పాల మధ్య స్వామి అమ్మవార్ల వైభవం చూసి తరించిపోయామని, ఇలాంటి వైభవం ఈ ఆలయంలో తప్ప ఏ ఆలయంలో కూడా చూడలేదని భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణ చార్యులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే ఒక వైభవమైన ఉత్సవం శ్రీ పుష్పయాగం. దీనిని ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించడానికి, లోకకల్యాణాన్ని కాంక్షించి, వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవిలకు అష్టోత్తర శత పుష్పాలతో, వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించామని అన్నారు. అనంతరం స్వామివారి వివిధ రకాల అద్భుతాలంకరణలో ఒక భక్తుడు రూపొందించిన క్యాలెండర్ ను ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించి, దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచితంగా పంపిణీ చేశామని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News