ఘనంగా స్వామి వివేకానంద జయంతి, ప్రపంచ యువజన దినోత్సవం
ఘనంగా స్వామి వివేకానంద జయంతి, ప్రపంచ యువజన దినోత్సవం
Editor Desk
రామన్నపేట / మేజర్ న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు, ప్రపంచ యువజన దినోత్సవం కార్యక్రమాలు సూర్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత ఆయన బోధనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వివేకానంద మార్గంలో నడిచినప్పుడే భావితరాలకు ఉత్తమ భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, సూర్య యువజన సంఘం నాయకుడు కునూరు మహేష్, మొదటి వార్డు మెంబర్ గోగో ప్రమీల రమేష్ యాదవ్, నాలుగో వార్డు మెంబర్ మేడి ఆంజనేయులు దేవి, ఐదో వార్డు మెంబర్ నేరటి మానస సురేష్ యాదవ్, ఆరవ వార్డు మెంబర్ కడారి పావని పాపయ్య, తొమ్మిదో వార్డు మెంబర్ వనం అండాలు యాదగిరి, పదో వార్డు మెంబర్ భోగ సహదేవు విజయ పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి