Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:09 AM

ఘనంగా శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
19-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.జయంతి సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ప్రతిష్టించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యువసేన సభ్యులు శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను, ఆయన దేశభక్తి, పరాక్రమం, ధైర్యసాహసాలను వివరించారు. దేశ స్వాభిమానం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ మహారాజ్ స్వరాజ్య సాధన కోసం అనేక యుద్ధాలు చేసి ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారు. ధైర్యం, పరిపాలనా నైపుణ్యం, దేశభక్తి కలగలిపిన మహానాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న, పాలకవర్గ సభ్యులు, శ్రీరామ్ యువసేన నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.జయంతి సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ప్రతిష్టించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యువసేన సభ్యులు శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను, ఆయన దేశభక్తి, పరాక్రమం, ధైర్యసాహసాలను వివరించారు. దేశ స్వాభిమానం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ మహారాజ్ స్వరాజ్య సాధన కోసం అనేక యుద్ధాలు చేసి ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారు. ధైర్యం, పరిపాలనా నైపుణ్యం, దేశభక్తి కలగలిపిన మహానాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న, పాలకవర్గ సభ్యులు, శ్రీరామ్ యువసేన నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News