Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:44 PM

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ
January 28, 2026 04:17 PM 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి స్థానికం ప్రధాన ప్రతినిధి

భువనగిరి పట్టణంలోని బీచ్ మహళ్ళా ప్రభుత్వ పాఠశాలలో “మరో గ్రంథాలయ ఉద్యమం బస్సు యాత్ర” గోడ ప్రతులను జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం మనసుకు ఆరోగ్యకరమైన వ్యాయామమని అన్నారు. బడి ఈడు పిల్లలకు ఇవ్వాల్సిన ఉత్తమ బహుమతి ఒక మంచి పుస్తకమేనని పేర్కొన్నారు.

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో” అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.

మరో గ్రంథాలయ ఉద్యమం బస్సు యాత్ర నిర్వాహకుడు కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు, పాఠశాలల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని, ప్రతి పాఠశాలలో రోజుకు ఒక పిరియడ్ పుస్తక పఠనానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి, తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షులు జిట్టా భాస్కర్ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్, దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడి భాస్కర్, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News