Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:42 AM

గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
January 12, 2026 04:42 PM 162 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట / మేజర్ న్యూస్:

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను ఆదరించి సర్పంచ్‌గా అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో వీధిలైట్లు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.అలాగే గ్రామాల్లో కుక్కలు, పందులు, కోతుల బెడదను నివారించేందుకు ఇప్పటికే పాలకవర్గం తీర్మానం చేసి చర్యలు ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామాభివృద్ధి కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రజలు, సంఘాల ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కందుల హనుమంతు, కార్యదర్శి పిట్టల మచ్చగిరి, డైరెక్టర్ రేపాక రాజు, పెద్ద బోయిన మీనమ్మ, బైరబోయిన వేణు, ఉపసర్పంచ్ మోటి రమేష్, పదో వార్డు మెంబర్ కందుల అండాలు, నకరికంటి పార్వతమ్మ, సుదర్శన్, నూర్జహాన్, అన్వర్, మహేష్, కవిత, లింగస్వామి, అనిత, యాదయ్య పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News