గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
Editor Desk
అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం తన ఛాంబర్లో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన ఆయన, ఆయా శాఖలు చేపట్టాల్సిన బాధ్యతలను సమీక్షించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో, వేదిక ఏర్పాటు, వీఐపీలు, అధికారులు, ప్రజలకు అనుకూలంగా సీటింగ్ వ్యవస్థను పక్కాగా రూపొందించాలని తెలిపారు. ప్రొటోకాల్ను కచ్చితంగా అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని, జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా సాగేలా చూడాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి