Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:09 AM

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
17-01-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం తన ఛాంబర్‌లో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన ఆయన, ఆయా శాఖలు చేపట్టాల్సిన బాధ్యతలను సమీక్షించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో, వేదిక ఏర్పాటు, వీఐపీలు, అధికారులు, ప్రజలకు అనుకూలంగా సీటింగ్ వ్యవస్థను పక్కాగా రూపొందించాలని తెలిపారు. ప్రొటోకాల్‌ను కచ్చితంగా అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని, జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా సాగేలా చూడాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం తన ఛాంబర్‌లో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన ఆయన, ఆయా శాఖలు చేపట్టాల్సిన బాధ్యతలను సమీక్షించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో, వేదిక ఏర్పాటు, వీఐపీలు, అధికారులు, ప్రజలకు అనుకూలంగా సీటింగ్ వ్యవస్థను పక్కాగా రూపొందించాలని తెలిపారు. ప్రొటోకాల్‌ను కచ్చితంగా అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని, జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా సాగేలా చూడాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News