Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య
25-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాజుల రవితేజ అనే యువకుడు ఆదివారం నాడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ​స్థానికులు, తెలిపిన వివరాల ప్రకారం. రవితేజ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు సేవించాడు అని. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు., అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా. ​ రవితేజ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో, వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రవితేజ పరిస్థితి విషమించి కన్నుమూశాడు. యువకుడి మరణంతో పెద్దకాపర్తి గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. చేతికి వచ్చిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Sthanikam

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాజుల రవితేజ అనే యువకుడు ఆదివారం నాడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ​స్థానికులు, తెలిపిన వివరాల ప్రకారం. రవితేజ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు సేవించాడు అని. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు., అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా. ​ రవితేజ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో, వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రవితేజ పరిస్థితి విషమించి కన్నుమూశాడు. యువకుడి మరణంతో పెద్దకాపర్తి గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. చేతికి వచ్చిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News