Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:45 PM

ఎయిడ్స్‌పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం

ఎయిడ్స్‌పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం

ఎయిడ్స్‌పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం
January 28, 2026 03:56 PM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధిలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. నల్లగొండ జిల్లా వైఆర్జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామస్థుల నుంచి మంచి స్పందన పొందింది.ఈ సందర్భంగా జోనల్ పర్యవేక్షకురాలు బాలజ్యోతి మాట్లాడుతూ, హెచ్ఐవీ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, రక్తం ద్వారా మాత్రమే వ్యాపించే వ్యాధి అని స్పష్టంగా తెలిపారు. హెచ్ఐవీ ఉన్న వారితో కలిసి జీవించడం, చేతులు కలపడం, వారు వాడిన మరుగుదొడ్లు ఉపయోగించడం, దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని ఆమె వివరించారు.పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత సూదులు–సిరంజీలు, కలుషిత రక్త మార్పిడి, హెచ్ఐవీ సోకిన తల్లి నుంచి శిశువుకుఈ నాలుగు మార్గాల ద్వారానే హెచ్ఐవీ వ్యాప్తి జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, రామన్నపేట ఏరియా ఆసుపత్రి కౌన్సిలర్, లింక్ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు రక్తపరీక్షలు చేయించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News