Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:36 AM

ఎయిడ్స్‌పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం

ఎయిడ్స్‌పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం

ఎయిడ్స్‌పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం
January 28, 2026 03:56 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధిలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. నల్లగొండ జిల్లా వైఆర్జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామస్థుల నుంచి మంచి స్పందన పొందింది.ఈ సందర్భంగా జోనల్ పర్యవేక్షకురాలు బాలజ్యోతి మాట్లాడుతూ, హెచ్ఐవీ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, రక్తం ద్వారా మాత్రమే వ్యాపించే వ్యాధి అని స్పష్టంగా తెలిపారు. హెచ్ఐవీ ఉన్న వారితో కలిసి జీవించడం, చేతులు కలపడం, వారు వాడిన మరుగుదొడ్లు ఉపయోగించడం, దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని ఆమె వివరించారు.పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత సూదులు–సిరంజీలు, కలుషిత రక్త మార్పిడి, హెచ్ఐవీ సోకిన తల్లి నుంచి శిశువుకుఈ నాలుగు మార్గాల ద్వారానే హెచ్ఐవీ వ్యాప్తి జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, రామన్నపేట ఏరియా ఆసుపత్రి కౌన్సిలర్, లింక్ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు రక్తపరీక్షలు చేయించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News