ఎయిడ్స్పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం
ఎయిడ్స్పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం
స్థానికం బృందం
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధిలో ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. నల్లగొండ జిల్లా వైఆర్జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామస్థుల నుంచి మంచి స్పందన పొందింది.ఈ సందర్భంగా జోనల్ పర్యవేక్షకురాలు బాలజ్యోతి మాట్లాడుతూ, హెచ్ఐవీ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, రక్తం ద్వారా మాత్రమే వ్యాపించే వ్యాధి అని స్పష్టంగా తెలిపారు. హెచ్ఐవీ ఉన్న వారితో కలిసి జీవించడం, చేతులు కలపడం, వారు వాడిన మరుగుదొడ్లు ఉపయోగించడం, దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని ఆమె వివరించారు.పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత సూదులు–సిరంజీలు, కలుషిత రక్త మార్పిడి, హెచ్ఐవీ సోకిన తల్లి నుంచి శిశువుకుఈ నాలుగు మార్గాల ద్వారానే హెచ్ఐవీ వ్యాప్తి జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, రామన్నపేట ఏరియా ఆసుపత్రి కౌన్సిలర్, లింక్ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు రక్తపరీక్షలు చేయించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి