ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం – వసతి, భోజనం పూర్తిగా ఉచితం
ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం – వసతి, భోజనం పూర్తిగా ఉచితం
Reporter Sangameshwar Reddy
ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం – వసతి, భోజనం పూర్తిగా ఉచితం
సంగారెడ్డి,
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఆధ్వర్యంలో పురుషులకు CCTV కెమెరా ఇన్స్టాలేషన్ మరియు సర్వీసింగ్లో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమై 13 రోజుల పాటు కొనసాగుతుంది.శిక్షణలో పాల్గొనే అభ్యర్థులకు వసతి మరియు భోజనం పూర్తిగా ఉచితంగా కల్పించబడుతుంది.19 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల తెల్ల రేషన్ కార్డు కలిగిన పురుషులు ఈ శిక్షణకు అర్హులు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందినవారికి మాత్రమే ఈ అవకాశం కల్పించబడింది.అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు మరియు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలి.ఈ శిక్షణ కేంద్రం స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, బైపాస్ రోడ్, సంగారెడ్డిలో నిర్వహించబడుతుంది.మరిన్ని వివరాలకు 9704446956, 9490129839 నంబర్లను సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి