Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

ఎన్నికల వేళే కాంగ్రెస్‌కు అభివృద్ధి గుర్తు – చిరుమర్తి లింగయ్య

ఎన్నికల వేళే కాంగ్రెస్‌కు అభివృద్ధి గుర్తు – చిరుమర్తి లింగయ్య

ఎన్నికల వేళే కాంగ్రెస్‌కు అభివృద్ధి గుర్తు – చిరుమర్తి లింగయ్య
10-01-2026 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా – చిట్యాల

చిట్యాల పట్టణ కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికలు సమీపిస్తేనే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల వేళ మాత్రమే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా మున్సిపాలిటీకి చేసింది శూన్యమని, పట్టణ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే ఈ రెండేళ్ల కాలంలో పట్టణానికి ఒక్క పైసా నిధులు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అప్పట్లో మంజూరు చేసిన పనులకు తాజాగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేయడమేంటని ప్రశ్నించారు.

రెండేళ్లుగా చేయని శంకుస్థాపనలు ఒక్కరోజులో చేయడంలో అంతర్యం ఏమిటో పట్టణ ప్రజలు గమనించాలని కోరారు. ఇవన్నీ ఎన్నికల కోసమే చేస్తున్న డ్రామాలేనని వ్యాఖ్యానించారు. చిట్యాల పట్టణానికి ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీలు నిజంగా ఎన్ని నిధులు మంజూరు చేశారో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.మేము మంజూరు చేసిన పనులకుశంకుస్థాపనలు చేయడం కాదు, కొత్తగా పనులు మంజూరు చేసి నిజమైన అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. అధికార బలంతో మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, డబ్బు సంచులు, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సిద్ధమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Sthanikam

ఎన్నికల వేళే కాంగ్రెస్‌కు అభివృద్ధి గుర్తు – చిరుమర్తి లింగయ్య

Article Image

నల్లగొండ జిల్లా – చిట్యాల

చిట్యాల పట్టణ కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికలు సమీపిస్తేనే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల వేళ మాత్రమే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా మున్సిపాలిటీకి చేసింది శూన్యమని, పట్టణ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే ఈ రెండేళ్ల కాలంలో పట్టణానికి ఒక్క పైసా నిధులు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అప్పట్లో మంజూరు చేసిన పనులకు తాజాగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేయడమేంటని ప్రశ్నించారు.

రెండేళ్లుగా చేయని శంకుస్థాపనలు ఒక్కరోజులో చేయడంలో అంతర్యం ఏమిటో పట్టణ ప్రజలు గమనించాలని కోరారు. ఇవన్నీ ఎన్నికల కోసమే చేస్తున్న డ్రామాలేనని వ్యాఖ్యానించారు. చిట్యాల పట్టణానికి ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీలు నిజంగా ఎన్ని నిధులు మంజూరు చేశారో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.మేము మంజూరు చేసిన పనులకుశంకుస్థాపనలు చేయడం కాదు, కొత్తగా పనులు మంజూరు చేసి నిజమైన అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. అధికార బలంతో మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, డబ్బు సంచులు, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సిద్ధమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News