ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనం.మాన్వి దేవేంద్రప్ప
ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనం.మాన్వి దేవేంద్రప్ప
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి
ఆదోని పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును స్మరిస్తూ ఆదివారం ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోనిలోని మాన్వి దేవేంద్రప్ప కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ, కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు వినగానే అది ఒక సంచలనమని వ్యాఖ్యానించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్కే సాధ్యమైందని గుర్తు చేశారు.నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ను మించిన వ్యక్తి లేడని, రాబోడని స్పష్టం చేశారు.బడుగు, బలహీన వర్గాలను శాసనసభల వరకు తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకంతో సంక్షేమ పాలనకు బాటలు వేసిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన మరణానంతరం పార్టీ కష్టకాలంలో చంద్రబాబు నాయకత్వ బాధ్యతలు భుజాన వేసుకుని, పార్టీని మెట్టుమెట్టుకు తీసుకువచ్చారని అన్నారు.దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కోటి సభ్యత్వాలు నమోదవడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టించామని, కార్యకర్తల జీవితానికి భరోసా ఇచ్చే విధంగా ఈ సభ్యత్వ వ్యవస్థ ఉందన్నారు. ఇవన్నీ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ఫలితమేనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి