Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:07 AM

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
January 18, 2026 10:31 AM 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడిగా ఎన్టీఆర్‌ను నాయకులు స్మరించారు. సామాన్యుడిని రాజకీయాల కేంద్రబిందువుగా నిలిపిన దార్శనికుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేష్ యాదవ్, తలారి లింగయ్య, కాట్రేగు సంజీవ్, నకిరే కంటి రవీందర్, కందాల దేవేందర్, కురుమ మహేందర్, కట్ట మహేందర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News