PRINT TIME: April 10, 2026 12:05 PM
ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
January 18, 2026 10:31 AM
134 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడిగా ఎన్టీఆర్ను నాయకులు స్మరించారు. సామాన్యుడిని రాజకీయాల కేంద్రబిందువుగా నిలిపిన దార్శనికుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేష్ యాదవ్, తలారి లింగయ్య, కాట్రేగు సంజీవ్, నకిరే కంటి రవీందర్, కందాల దేవేందర్, కురుమ మహేందర్, కట్ట మహేందర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి