ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు
ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన మృదు స్వభావి సౌమ్యుడు బొర్రా కిరణ్, అదే విధంగా విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరియొక సారి ఎన్నికైన ప్రముఖ న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు లకు తిరువూరు మండల, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేస్తూ బొర్రా కిరణ్, డిసిసి అధ్యక్షులుగా, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నరహరిశెట్టి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని అలా చేస్తారని, పార్టీలోకి యువ రక్తాన్ని ప్రోత్సహించాలని తద్వారా పీసీసీ,ఏఐసీసీ పిలుపుమేరకు ప్రతి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తాలని, పల్లెపాటి శ్రీనివాసరావు జీవన బాబు బొడ్డు ప్రకాష్ రావు గంజా కృష్ణమోహన్,ఉప్పలపాటి లక్ష్మీ దాస్ కోరినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ ఇంచార్జ్ చిన్నంశెట్టి నాగేశ్వరరావు, బి.సి.సెల్ నియోజకవర్గం నాయకుడు జీడిమల్ల బాలు, పర్వతం రామారావు, కే ఎల్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు,గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి