Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:32 PM

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
May 21, 2026 04:21 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను వారు గురువారం ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ వికలాంగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. వికలాంగుల సంక్షేమానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు.


కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కే. వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం. అడవయ్య, జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, వనం ఉపేందర్, బోల్లేపల్లి స్వామి, కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News