ఎన్పీఆర్డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
ఎన్పీఆర్డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
Editor Desk
భువనగిరి,: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. సదస్సుకు సంబంధించిన వాల్పోస్టర్ను వారు గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ వికలాంగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. వికలాంగుల సంక్షేమానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కే. వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం. అడవయ్య, జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, వనం ఉపేందర్, బోల్లేపల్లి స్వామి, కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి