Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:49 AM

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
May 21, 2026 04:21 PM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను వారు గురువారం ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ వికలాంగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. వికలాంగుల సంక్షేమానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు.


కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కే. వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం. అడవయ్య, జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, వనం ఉపేందర్, బోల్లేపల్లి స్వామి, కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News