చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తన వార్డులో ఆడపిల్ల పెళ్లి జరిగితే “ఆడపడుచు పెళ్లి కానుక”గా రూ.15,116/- అందజేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు 7వ వార్డుకు చెందిన చింత సువర్ణ - దాసు కుమార్తె వివాహానికి రూ.15,116/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, పోకల ఏసురత్నం, బోడ శ్రీను, పాల శివ, దేశపాక ఇస్తారి నాగరాజు, కుక్కల వీరేష్, నవీన్, అభిషేక్ తదితర వార్డు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి