Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాకాలం ముందు చర్యలు తీసుకోండి – గ్రామస్థుల విజ్ఞప్తి కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 07:38 PM

ఎన్‌జి కళాశాలలో సామాజిక విప్లవకారుల జయంతులు

ఎన్‌జి కళాశాలలో సామాజిక విప్లవకారుల జయంతులు

ఎన్‌జి కళాశాలలో సామాజిక విప్లవకారుల జయంతులు
April 13, 2026 05:40 PM 4 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సోమవారం సామాజిక విప్లవకారుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్టాఫ్ క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ జయంతులను వైభవంగా జరిపారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ మాట్లాడుతూ—ఈ మహనీయులు కేవలం ఒక వర్గానికో, కులానికో పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. అణగారిన వర్గాలు, మహిళలకు విద్యను అందించడంలో ఫులే చేసిన కృషి అపారమని గుర్తుచేశారు.

రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను కాపాడుకుంటూ, అంబేద్కర్ సూచించిన “శిక్షణ, సంఘటన, పోరాటం” మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో, అణగారిన వర్గాల రాజకీయ సాధికారతలో బాబు జగజ్జీవన్ రామ్ పోషించిన పాత్రను స్మరించుకున్నారు.

పరీక్షల నియంత్రణాధికారి డా. టి. మునిస్వామి మాట్లాడుతూ—చదువుతోనే సాధికారత సాధ్యమని నమ్మిన ఈ మహనీయుల ఆలోచనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో స్టాఫ్ క్లబ్ కార్యదర్శి సిహెచ్. సుధాకర్, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. జి. భాగ్యలక్ష్మి, రాజనీతి శాస్త్ర విభాగం అధ్యక్షులు డా. ఎ. మల్లేశం, అధ్యాపకులు డా. భట్టు కిరీటం, డా. అనిల్ బొజ్జ, డా. అనిల్ అబ్రహం, కోటయ్య, శంకర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News