Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:47 AM

ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాల్లో సేవా స్పూర్తి వెల్లువ

ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాల్లో సేవా స్పూర్తి వెల్లువ

ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాల్లో సేవా స్పూర్తి వెల్లువ
January 23, 2026 04:46 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శీతాకాల సమావేశ శిబిరాల్లో మూడవ రోజు సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. మేరా యువ భారత్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ఆధ్వర్యంలో దోరేపల్లిలో, యూనిట్–సిక్స్ ఆధ్వర్యంలో పగిడిమర్రిలో నిర్వహిస్తున్న శిబిరాలను ఎంపీడీవో వేద రక్షిత సందర్శించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాసులు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మునిస్వామి, టీఎస్కెసి కోఆర్డినేటర్ అనిల్ అబ్రహం, ఫిజికల్ డైరెక్టర్ అదేమల్లేశం, డాక్టర్ అంకుష్, మేరా యువ భారత్ నల్గొండ స్టాఫ్ కొండా నాయక్‌తో పాటు కళాశాల ఉపన్యాస బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో వేద రక్షిత మాట్లాడుతూ గత మూడు రోజులుగా విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. సేవాభావం ద్వారా సామాజిక అవగాహన పెరుగుతుందని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాలు గ్రామీణ సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని తెలిపారు. ఆరోగ్యం, అక్షరాస్యత పెంపొందించడంతో పాటు సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, యూనిట్–సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, డాక్టర్ అంకుష్, దోరేపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగమణి సైదులు, పగిడిమర్రి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామకృష్ణమ్మ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగాల్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రేణుక, మాజీ సర్పంచులు నర్సిరెడ్డి, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సత్తయ్య, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, గ్రామ ప్రజలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News