ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాల్లో సేవా స్పూర్తి వెల్లువ
ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాల్లో సేవా స్పూర్తి వెల్లువ
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శీతాకాల సమావేశ శిబిరాల్లో మూడవ రోజు సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. మేరా యువ భారత్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ఆధ్వర్యంలో దోరేపల్లిలో, యూనిట్–సిక్స్ ఆధ్వర్యంలో పగిడిమర్రిలో నిర్వహిస్తున్న శిబిరాలను ఎంపీడీవో వేద రక్షిత సందర్శించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాసులు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మునిస్వామి, టీఎస్కెసి కోఆర్డినేటర్ అనిల్ అబ్రహం, ఫిజికల్ డైరెక్టర్ అదేమల్లేశం, డాక్టర్ అంకుష్, మేరా యువ భారత్ నల్గొండ స్టాఫ్ కొండా నాయక్తో పాటు కళాశాల ఉపన్యాస బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో వేద రక్షిత మాట్లాడుతూ గత మూడు రోజులుగా విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. సేవాభావం ద్వారా సామాజిక అవగాహన పెరుగుతుందని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాలు గ్రామీణ సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని తెలిపారు. ఆరోగ్యం, అక్షరాస్యత పెంపొందించడంతో పాటు సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, యూనిట్–సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, డాక్టర్ అంకుష్, దోరేపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగమణి సైదులు, పగిడిమర్రి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామకృష్ణమ్మ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగాల్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రేణుక, మాజీ సర్పంచులు నర్సిరెడ్డి, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సత్తయ్య, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, గ్రామ ప్రజలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి