Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:48 AM

ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా కళ్యాణ పత్రిక జాతర గోడపత్రిక ఆవిష్కరణ

ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా కళ్యాణ పత్రిక జాతర గోడపత్రిక ఆవిష్కరణ

ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా కళ్యాణ పత్రిక జాతర గోడపత్రిక ఆవిష్కరణ
February 14, 2026 01:37 PM 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెద్దకాపర్తిలో కళ్యాణ మహోత్సవాల సందడి ప్రారంభం

చిట్యాల మండలం పరిధిలోని పెద్దకాపర్తి గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. శ్రీ భూ సమేత తిరుమలనాద స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు తొలి అడుగుగా కళ్యాణ పత్రికను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు అందజేసి, జాతర గోడ పత్రికను ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్దకాపర్తి గ్రామ జాతర ప్రాంతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తుల ఐక్యత, భక్తిశ్రద్ధలతో జాతర మరింత వైభవంగా జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, ఏర్పుల కుర్రు యాదయ్య, సాగర్ల నాగరాజు, నవ్యశ్రీ, ఆనగంటి నరేష్, పూజ, మర్రి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, జిల్లా నరసింహ, ఎద్దుల అజిత్ రెడ్డి, మాజీ చైర్మన్ తెలుసూరి సైదులు, మాజీ ఉపసర్పంచ్ నూతి వెంకటేశం, సత్యశ్రీ గుజ్జర్ యాదగిరి, రాసి మల్ల జానయ్య, భైరవని బిక్షం, బుంగపాట్ల తిమ్మయ్య, శిరస్సు ఇదయ్య తదితరులు హాజరయ్యారు.

గ్రామంలో కళ్యాణ మహోత్సవాల సందడి ప్రారంభమవడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జాతర ఏర్పాట్లను నిర్వాహకులు వేగవంతం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News