స్థానికం ప్రధాన ప్రతినిధి
ప్రజా జీవితాలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎల్బీనగర్ ఇన్స్ పెక్టర్ కె. వినోద్ కుమార్ అన్నారు. మల్కాజిగిరి కమీషనర్ అవినాష్ మహంతి ఆదేశానుసారం శుక్రవారం ఎల్బీనగర్ లోని మజీద్ గల్లీ, మార్కెట్ ప్రాంతం, పాత గ్రామం, సిరినగర్ తదితర ప్రాంతాలలో తన సిబ్బందితో కలిసి పాదయాత్ర చేసారు. అనంతరం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతకు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆకాతాయిల ఆగడాలు అరికట్టినట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎస్సైలు మల్లయ్య, ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి