ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా రవీందర్
ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా రవీందర్
Editor Desk
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా సర్వసభ్య సమావేశంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
భువనగిరి ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని అచ్యుత్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యదర్శి జనరల్ Matangi Srinivas ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం కార్మికుల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.
జిల్లా అధ్యక్షుడిగా ఎం.ఆర్. రవీందర్, జిల్లా కార్యదర్శిగా బొట్ల రాజేశ్వర్ను ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్లుగా వంగాల మల్లేష్, ఆడెపు శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్గా నరసింహ నాయక్, అసిస్టెంట్ సెక్రటరీగా నల్ల మహేష్, చీఫ్ అడ్వైజర్గా సి.హెచ్. పాపులు, ట్రెజరర్గా ఎం. లింగయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి. సిద్ధేశ్వర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రమేష్, జయరాజును ఎన్నుకున్నారు.
భువనగిరి డివిజన్ కమిటీలో అధ్యక్షుడిగా బాలెంల దుర్గయ్య, కార్యదర్శిగా కందుకూరు యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా బొట్ల నరేష్, వైస్ ప్రెసిడెంట్లుగా పొడిచేటి మహేష్, గోవర్ధన్, అసిస్టెంట్ సెక్రటరీగా వీసం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బద్దుల శివ, ట్రెజరర్గా భూపతి మల్లేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నరసింహ, భరత్లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపా సన్మానించారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి