Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:32 AM

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ
January 22, 2026 08:28 PM 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హనుమకొండ అదనపు కలెక్టర్ ఇంట్లో రూ.100 కోట్ల అక్రమాస్తుల ఆనవాళ్లు

హనుమకొండ, స్థానికం ప్రధాన ప్రతినిధి

హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఇంట్లో జరిగిన అవినీతి నిరోధక శాఖ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు హైదరాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ సహా పలు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించాయి.

సోదాల్లో రూ.100 కోట్ల వరకు అక్రమాస్తుల ఆనవాళ్లు లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదనపు కలెక్టర్‌కు సంబంధించిన రెండు అధునాతన విల్లాలు, పది ప్లాట్లు, 14 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు రూ.50 లక్షల బ్యాంక్‌ నిల్వలు, మరికొన్ని బినామీ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

స్వాధీనం చేసుకున్న పత్రాలు, లావాదేవీల ఆధారంగా అధికారులు లోతైన విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News