Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:39 PM

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ
January 22, 2026 08:28 PM 177 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హనుమకొండ అదనపు కలెక్టర్ ఇంట్లో రూ.100 కోట్ల అక్రమాస్తుల ఆనవాళ్లు

హనుమకొండ, స్థానికం ప్రధాన ప్రతినిధి

హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఇంట్లో జరిగిన అవినీతి నిరోధక శాఖ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు హైదరాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ సహా పలు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించాయి.

సోదాల్లో రూ.100 కోట్ల వరకు అక్రమాస్తుల ఆనవాళ్లు లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదనపు కలెక్టర్‌కు సంబంధించిన రెండు అధునాతన విల్లాలు, పది ప్లాట్లు, 14 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు రూ.50 లక్షల బ్యాంక్‌ నిల్వలు, మరికొన్ని బినామీ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

స్వాధీనం చేసుకున్న పత్రాలు, లావాదేవీల ఆధారంగా అధికారులు లోతైన విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News