Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:36 AM

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ
January 22, 2026 08:28 PM 168 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

హనుమకొండ అదనపు కలెక్టర్ ఇంట్లో రూ.100 కోట్ల అక్రమాస్తుల ఆనవాళ్లు

హనుమకొండ, స్థానికం ప్రధాన ప్రతినిధి

హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఇంట్లో జరిగిన అవినీతి నిరోధక శాఖ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు హైదరాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ సహా పలు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించాయి.

సోదాల్లో రూ.100 కోట్ల వరకు అక్రమాస్తుల ఆనవాళ్లు లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదనపు కలెక్టర్‌కు సంబంధించిన రెండు అధునాతన విల్లాలు, పది ప్లాట్లు, 14 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు రూ.50 లక్షల బ్యాంక్‌ నిల్వలు, మరికొన్ని బినామీ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

స్వాధీనం చేసుకున్న పత్రాలు, లావాదేవీల ఆధారంగా అధికారులు లోతైన విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News