PRINT TIME: July 11, 2026 10:05 AM
ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు
ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు
January 26, 2026 10:48 AM
129 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి ఇంచార్జ్ వైద్యాధికారి డాక్టర్ మాధవాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ గౌరవాన్ని చాటారు.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, కర్తవ్య నిర్వహణలో అంకితభావం అవసరమని తెలిపారు.వేడుకల్లో ఆసుపత్రి సిబ్బంది సువర్ణ, సాజియా, ఉమా జ్యోతి, శివ, వాసంతి రేష్మ సోమవారం వేడుకలు శ్రీనివాస్, ఉదయ్ కుమార్, సతీష్, తకియోద్దీన్, భీమ్పాక నగేష్, ఎన్. రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి