Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:09 AM

ఏళ్ల నాటి సమస్యలకు చెక్… న్యాల్కల్ పీహెచ్‌సీలో రూ.16 లక్షల అభివృద్ధి పనులు పూర్తి

ఏళ్ల నాటి సమస్యలకు చెక్… న్యాల్కల్ పీహెచ్‌సీలో రూ.16 లక్షల అభివృద్ధి పనులు పూర్తి

ఏళ్ల నాటి సమస్యలకు చెక్… న్యాల్కల్ పీహెచ్‌సీలో రూ.16 లక్షల అభివృద్ధి పనులు పూర్తి
07-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో ఏళ్లుగా ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలకు పరిష్కారం లభించింది.రూ.16 లక్షల CCR నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.పీహెచ్‌సీలో దీర్ఘకాలంగా ఉన్న మరుగుదొడ్ల సమస్య,శిథిలావస్థలో ఉన్న పైకప్పు,తాగునీటి సౌకర్యం లేకపోవడం,సమావేశ భవనం కొరత వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టారు.ఉన్నతాధికారుల స్పందనతో మరుగుదొడ్ల మరమ్మతులు,పైకప్పు పునరుద్ధరణ,తాగునీటి సౌకర్యం కల్పించడం,సమావేశ భవనం నిర్మాణం పూర్తయ్యాయి.ఈ అభివృద్ధి పనులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(DMHO)శుక్రవారం ప్రారంభించారు .దీంతో పీహెచ్‌సీలో వైద్య సేవలు మరింత మెరుగుపడటంతో పాటు,వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

ఏళ్ల నాటి సమస్యలకు చెక్… న్యాల్కల్ పీహెచ్‌సీలో రూ.16 లక్షల అభివృద్ధి పనులు పూర్తి

Article Image

న్యాల్కల్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో ఏళ్లుగా ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలకు పరిష్కారం లభించింది.రూ.16 లక్షల CCR నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.పీహెచ్‌సీలో దీర్ఘకాలంగా ఉన్న మరుగుదొడ్ల సమస్య,శిథిలావస్థలో ఉన్న పైకప్పు,తాగునీటి సౌకర్యం లేకపోవడం,సమావేశ భవనం కొరత వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టారు.ఉన్నతాధికారుల స్పందనతో మరుగుదొడ్ల మరమ్మతులు,పైకప్పు పునరుద్ధరణ,తాగునీటి సౌకర్యం కల్పించడం,సమావేశ భవనం నిర్మాణం పూర్తయ్యాయి.ఈ అభివృద్ధి పనులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(DMHO)శుక్రవారం ప్రారంభించారు .దీంతో పీహెచ్‌సీలో వైద్య సేవలు మరింత మెరుగుపడటంతో పాటు,వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News