Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 10:10 AM

ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
April 13, 2026 04:37 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎన్‌ఎస్‌పి క్యాంప్ ఇస్లాంపుర సెక్టార్లలో ఉన్న అశోక్ నగర్ 1-1, ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ (Poshan Pakhwada) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి సీడీపీఓ రేఖల మమత, 4వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా స్థానికంగా లభించే పోషక విలువలున్న ఆహార పదార్థాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు (రాగులు, సద్దలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికెలు) ఉపయోగించి ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శన నిర్వహించారు. తల్లులు, సంరక్షకుల మధ్య వంటల పోటీలు కూడా ఏర్పాటు చేసి, ప్రతి వంటకంలో ఉన్న పోషక విలువలను వివరించారు.

సీడీపీఓ రేఖల మమత మాట్లాడుతూ సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఇంట్లోనూ ఈ విధమైన పోషకాహార వంటలను క్రమం తప్పకుండా తయారు చేయాలని తల్లులకు సూచించారు.

కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్ మిల్లెట్స్‌తో జావ తయారు చేసి, దాని పోషక విలువలను వివరించారు. తల్లులు మిల్లెట్స్‌తో రొట్టెలు తయారు చేసి పోటీలను విజయవంతం చేశారు. అనంతరం పోషణపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ టి. కవిత, సూపర్వైజర్లు కె. నాగమణి, నజీమా బేగం, మహమ్మద్, అంగన్వాడీ టీచర్లు లలితమ్మ, పార్వతి, రామానుజమ్మ, రజిత, జ్యోతి, గీత, శభానా తదితరులు, తల్లులు, గర్భిణీ స్త్రీలు మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News