Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్ కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 06:24 PM

ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
April 13, 2026 04:37 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎన్‌ఎస్‌పి క్యాంప్ ఇస్లాంపుర సెక్టార్లలో ఉన్న అశోక్ నగర్ 1-1, ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ (Poshan Pakhwada) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి సీడీపీఓ రేఖల మమత, 4వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా స్థానికంగా లభించే పోషక విలువలున్న ఆహార పదార్థాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు (రాగులు, సద్దలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికెలు) ఉపయోగించి ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శన నిర్వహించారు. తల్లులు, సంరక్షకుల మధ్య వంటల పోటీలు కూడా ఏర్పాటు చేసి, ప్రతి వంటకంలో ఉన్న పోషక విలువలను వివరించారు.

సీడీపీఓ రేఖల మమత మాట్లాడుతూ సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఇంట్లోనూ ఈ విధమైన పోషకాహార వంటలను క్రమం తప్పకుండా తయారు చేయాలని తల్లులకు సూచించారు.

కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్ మిల్లెట్స్‌తో జావ తయారు చేసి, దాని పోషక విలువలను వివరించారు. తల్లులు మిల్లెట్స్‌తో రొట్టెలు తయారు చేసి పోటీలను విజయవంతం చేశారు. అనంతరం పోషణపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ టి. కవిత, సూపర్వైజర్లు కె. నాగమణి, నజీమా బేగం, మహమ్మద్, అంగన్వాడీ టీచర్లు లలితమ్మ, పార్వతి, రామానుజమ్మ, రజిత, జ్యోతి, గీత, శభానా తదితరులు, తల్లులు, గర్భిణీ స్త్రీలు మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News