ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
Editor Desk
మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎన్ఎస్పి క్యాంప్ ఇస్లాంపుర సెక్టార్లలో ఉన్న అశోక్ నగర్ 1-1, ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ (Poshan Pakhwada) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి సీడీపీఓ రేఖల మమత, 4వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా స్థానికంగా లభించే పోషక విలువలున్న ఆహార పదార్థాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు (రాగులు, సద్దలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికెలు) ఉపయోగించి ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శన నిర్వహించారు. తల్లులు, సంరక్షకుల మధ్య వంటల పోటీలు కూడా ఏర్పాటు చేసి, ప్రతి వంటకంలో ఉన్న పోషక విలువలను వివరించారు.
సీడీపీఓ రేఖల మమత మాట్లాడుతూ సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఇంట్లోనూ ఈ విధమైన పోషకాహార వంటలను క్రమం తప్పకుండా తయారు చేయాలని తల్లులకు సూచించారు.
కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్ మిల్లెట్స్తో జావ తయారు చేసి, దాని పోషక విలువలను వివరించారు. తల్లులు మిల్లెట్స్తో రొట్టెలు తయారు చేసి పోటీలను విజయవంతం చేశారు. అనంతరం పోషణపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ టి. కవిత, సూపర్వైజర్లు కె. నాగమణి, నజీమా బేగం, మహమ్మద్, అంగన్వాడీ టీచర్లు లలితమ్మ, పార్వతి, రామానుజమ్మ, రజిత, జ్యోతి, గీత, శభానా తదితరులు, తల్లులు, గర్భిణీ స్త్రీలు మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి