PRINT TIME: April 09, 2026 10:31 PM
విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు
విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు
April 09, 2026 08:13 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
భువనగిరి డివిజన్ పరిధిలో విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు,పీస్రేటు కార్మికులు, అన్మ్యాండ్ కార్మికులు, సొసైటీ కార్మికులు, హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది.TGSPDCL కంపెనీ నాయకుడు బొక్క పాండరిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది.ట్రాన్స్కో,డిస్కం,బీసీ రేటు కార్మికులు మరియు ఎస్పీఎం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తున్నారు.కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజి మహేష్,కో-చైర్మన్లు మల్లేష్,ఈదయ్య,బాలకృష్ణ,సంయుక్త కార్యదర్శులు భాస్కర్,శోభన్ బాబు,బింగి శ్రీకాంత్ గౌడ్,మల్లేష్,పి.ఏ.ఏ వాసు,విజయలక్ష్మి,చోళ్లేటి సోమేశ్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి