విద్యారంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి మే 2–10 వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
విద్యారంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి మే 2–10 వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
Editor Desk
బొమ్మలరామారం మండలంలో మే 2 నుండి 10 వరకు నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు పిలుపునిచ్చారు.
సోమవారం రామన్నపేట మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లావుడియ రాజు మాట్లాడుతూ “అధ్యయనం–పోరాటం” నినాదంతో విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా విద్యారంగం క్రమంగా దిగజారుతోందని, ప్రభుత్వ విద్యను కాపాడాల్సిన పాలకులే ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను విద్యలోకి తీసుకురావడం వల్ల విద్య వ్యాపార వస్తువుగా మారుతోందని, సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతోందన్నారు.
జాతీయ విద్యా విధానం ద్వారా విద్యను కాషాయీకరణ దిశగా మళ్లిస్తూ, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు పెండింగ్లో ఉంచడం వల్ల విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు అవసరమైన ఖర్చులు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో మే 2 నుండి 10 వరకు బొమ్మలరామారం మండలంలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలు, శాస్త్రీయ ఆలోచన, విద్యారంగ సమస్యలు మరియు భవిష్యత్ పోరాటాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని విద్యార్థి నాయకత్వం ఈ తరగతులకు హాజరై మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టాల ఉదయ్ కుమార్, శివ కుమార్, చరణ్, నవదీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి