Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:23 AM

విద్యారంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి మే 2–10 వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు

విద్యారంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి మే 2–10 వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు

విద్యారంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి మే 2–10 వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
April 13, 2026 04:45 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం మండలంలో మే 2 నుండి 10 వరకు నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు పిలుపునిచ్చారు.

సోమవారం రామన్నపేట మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లావుడియ రాజు మాట్లాడుతూ “అధ్యయనం–పోరాటం” నినాదంతో విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా విద్యారంగం క్రమంగా దిగజారుతోందని, ప్రభుత్వ విద్యను కాపాడాల్సిన పాలకులే ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను విద్యలోకి తీసుకురావడం వల్ల విద్య వ్యాపార వస్తువుగా మారుతోందని, సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతోందన్నారు.

జాతీయ విద్యా విధానం ద్వారా విద్యను కాషాయీకరణ దిశగా మళ్లిస్తూ, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు పెండింగ్‌లో ఉంచడం వల్ల విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు అవసరమైన ఖర్చులు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో మే 2 నుండి 10 వరకు బొమ్మలరామారం మండలంలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలు, శాస్త్రీయ ఆలోచన, విద్యారంగ సమస్యలు మరియు భవిష్యత్ పోరాటాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని విద్యార్థి నాయకత్వం ఈ తరగతులకు హాజరై మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టాల ఉదయ్ కుమార్, శివ కుమార్, చరణ్, నవదీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News