విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ
విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ
Krishna
శుక్రవారం సదాశివపేట మండలంలోని సూరారం, ఎల్లారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యార్థుల వార్షిక పరీక్షలను మండల విద్యాధికారి ఎన్. శంకర్ పరిశీలించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 1 నుండి 7వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు నిర్వహించాల్సి ఉండగా, కొన్ని పాఠశాలల్లో సమయపాలన పాటించకుండా ముందుగానే ముగిస్తున్నట్లు గమనించామని తెలిపారు. ఇటువంటి విధానాలు అనుసరించకూడదని, విద్యార్థులు పరీక్షల నియమాలను తప్పనిసరిగా పాటించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యిన వెంటనే తదుపరి రోజు వ్రాయబోయే విషయాన్ని విద్యార్థులకు బోధించాలని, విద్యార్థులను మధ్యాహ్నం 12:30 గంటల ముందు పాఠశాల నుండి పంపకూడదని, అవసరమైతే తల్లిదండ్రులు వచ్చి ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకున్న తర్వాతనే పంపాలని తెలిపారు. అలాగే మధ్యాహ్నం 12:30కు భోజనం అందించాలని సూచించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా, సమయపాలనతో సక్రమంగా నిర్వహించాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివశంకర్, బస్వరాజు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది అక్బర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి