Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:45 PM

విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ

విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ

విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ
April 10, 2026 05:00 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శుక్రవారం సదాశివపేట మండలంలోని సూరారం, ఎల్లారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యార్థుల వార్షిక పరీక్షలను మండల విద్యాధికారి ఎన్. శంకర్ పరిశీలించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 1 నుండి 7వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు నిర్వహించాల్సి ఉండగా, కొన్ని పాఠశాలల్లో సమయపాలన పాటించకుండా ముందుగానే ముగిస్తున్నట్లు గమనించామని తెలిపారు. ఇటువంటి విధానాలు అనుసరించకూడదని, విద్యార్థులు పరీక్షల నియమాలను తప్పనిసరిగా పాటించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యిన వెంటనే తదుపరి రోజు వ్రాయబోయే విషయాన్ని విద్యార్థులకు బోధించాలని, విద్యార్థులను మధ్యాహ్నం 12:30 గంటల ముందు పాఠశాల నుండి పంపకూడదని, అవసరమైతే తల్లిదండ్రులు వచ్చి ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకున్న తర్వాతనే పంపాలని తెలిపారు. అలాగే మధ్యాహ్నం 12:30కు భోజనం అందించాలని సూచించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా, సమయపాలనతో సక్రమంగా నిర్వహించాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివశంకర్, బస్వరాజు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది అక్బర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News