Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ

విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ

విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ
April 10, 2026 05:00 PM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శుక్రవారం సదాశివపేట మండలంలోని సూరారం, ఎల్లారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యార్థుల వార్షిక పరీక్షలను మండల విద్యాధికారి ఎన్. శంకర్ పరిశీలించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 1 నుండి 7వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు నిర్వహించాల్సి ఉండగా, కొన్ని పాఠశాలల్లో సమయపాలన పాటించకుండా ముందుగానే ముగిస్తున్నట్లు గమనించామని తెలిపారు. ఇటువంటి విధానాలు అనుసరించకూడదని, విద్యార్థులు పరీక్షల నియమాలను తప్పనిసరిగా పాటించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యిన వెంటనే తదుపరి రోజు వ్రాయబోయే విషయాన్ని విద్యార్థులకు బోధించాలని, విద్యార్థులను మధ్యాహ్నం 12:30 గంటల ముందు పాఠశాల నుండి పంపకూడదని, అవసరమైతే తల్లిదండ్రులు వచ్చి ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకున్న తర్వాతనే పంపాలని తెలిపారు. అలాగే మధ్యాహ్నం 12:30కు భోజనం అందించాలని సూచించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా, సమయపాలనతో సక్రమంగా నిర్వహించాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివశంకర్, బస్వరాజు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది అక్బర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News