PRINT TIME: March 29, 2026 09:28 PM
విద్యార్థినిగా మారిన మహిళా ఎస్ ఐ .. ఆకతాయిలకు చెక్
విద్యార్థినిగా మారిన మహిళా ఎస్ ఐ .. ఆకతాయిలకు చెక్
March 29, 2026 07:39 PM
42 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భూపాలపల్లి: పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు టేకుమట్ల మహిళా ఎస్ ఐ అమూల్య వినూత్నంగా వ్యవహరించారు.
ఖాకీ యూనిఫాం వదిలి, విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యారు. ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని సాధారణ విద్యార్థినిలా అక్కడికి వెళ్లి పరిస్థితులను గమనించారు.
ఈ చర్యతో ఆకతాయిల కదలికలను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వీలు కలిగిందని సమాచారం. ఎస్సై అమూల్య ధైర్యం, సమయస్ఫూర్తిని స్థానికులు అభినందిస్తున్నారు.
పోలీసులు ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని ఈ ఘటనతో స్పష్టమైందని వారు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి