విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.మేడి హరికృష్ణ
విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.మేడి హరికృష్ణ
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్
తిప్పర్తి మండలం బండ్లవారి గూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురుకుల స్టడీ మెటీరియల్స్ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల వెంకటరమణ మాట్లాడుతూ, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు పేద విద్యార్థులకు చదువులో తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు.
అనంతరం మేడి హరికృష్ణ మాట్లాడుతూ, పేద కుటుంబాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన సహాయాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి