Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:19 AM

విద్యార్థుల ప్రోత్సాహానికి సర్పంచ్ అడుగు ముందుకు

విద్యార్థుల ప్రోత్సాహానికి సర్పంచ్ అడుగు ముందుకు

విద్యార్థుల ప్రోత్సాహానికి సర్పంచ్ అడుగు ముందుకు
January 27, 2026 06:00 AM 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

క్రమశిక్షణే విద్యార్థుల భవిష్యత్‌కు పునాది

వెల్లంకి పాఠశాలలో 340 మంది విద్యార్థులకు పెన్నుల సెట్ బహూకరణ

రామన్నపేట స్థానికం ప్రధాని ప్రతినిధి

విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని వెల్లంకి గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ అన్నారు. సోమవారం వెల్లంకి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధనకు నిరంతర కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డాక్టర్లుగా ఎదిగి తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా తమ సొంత నిధులతో 340 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 విలువైన పెన్నుల సెట్లను బహుకరించి విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు ప్రదర్శించిన పరేడ్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు ఎడ్ల మహేందర్ రెడ్డి, కూరేళ్ళ నరసింహాచారి, ఉప సర్పంచ్ మిర్యాల రాజకుమార్, లక్ష్మీ హ్యాండ్లూమ్స్ అధినేత తూడి మురళీధర్, ఏఏపీసీ చైర్మన్ ఉదయ రాణి, వార్డు సభ్యులు నకిరేకంటి నరేష్, గువ్వగోని మల్లమ్మ, మిర్యాల జగన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News