యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని దుబ్బాక మణికంఠ యూత్ వాలీబాల్ టీమ్కు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకుడు బి.ఎన్. గౌడ్ టీషర్ట్లను డొనేట్ చేశారు.
ఈ సందర్భంగా బి.ఎన్. గౌడ్ మాట్లాడుతూ… గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా తన వంతు సహకారం అందించానని తెలిపారు. యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్పూర్తిని అలవరచుకోవాలని ఆకాంక్షించారు.యువతకు అందుతున్న ఇటువంటి ప్రోత్సాహం భవిష్యత్తులో మరిన్ని క్రీడా ప్రతిభలను వెలికితీసేందుకు దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి