దుబ్బాకలో దేశభక్తి వెల్లువ – భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ
దుబ్బాకలో దేశభక్తి వెల్లువ – భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. మూడు రంగుల జాతీయ పతాకాలతో గ్రామమంతా ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.
సుమారు వంద మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి పట్టుకొని ప్రధాన రహదారి వెంట ప్రదర్శనగా సాగారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశభక్తిని యువత, విద్యార్థులు తమ జీవన విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ మార్పుకు యువతే ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ, ఉప సర్పంచ్ గుండాల రమేష్, భగత్ సింగ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి