Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:00 PM

దుబ్బాకలో దేశభక్తి వెల్లువ – భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ

దుబ్బాకలో దేశభక్తి వెల్లువ – భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ

దుబ్బాకలో దేశభక్తి వెల్లువ – భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ
26-01-2026 253 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. మూడు రంగుల జాతీయ పతాకాలతో గ్రామమంతా ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.

సుమారు వంద మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి పట్టుకొని ప్రధాన రహదారి వెంట ప్రదర్శనగా సాగారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశభక్తిని యువత, విద్యార్థులు తమ జీవన విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ మార్పుకు యువతే ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ, ఉప సర్పంచ్ గుండాల రమేష్, భగత్ సింగ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

Sthanikam

దుబ్బాకలో దేశభక్తి వెల్లువ – భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. మూడు రంగుల జాతీయ పతాకాలతో గ్రామమంతా ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.

సుమారు వంద మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి పట్టుకొని ప్రధాన రహదారి వెంట ప్రదర్శనగా సాగారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశభక్తిని యువత, విద్యార్థులు తమ జీవన విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ మార్పుకు యువతే ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ, ఉప సర్పంచ్ గుండాల రమేష్, భగత్ సింగ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News